
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువత, భూ నిర్వాసితులకు 80% ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేటకు రైల్వే డివిజన్, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించకపోతే
మరో తెలంగాణ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ ధర్నాలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని 13 ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు.








